Kanguva: వరుస సౌత్ సినిమా ఛాన్సులు పొందుతున్న దిశా.. ఇక్కడే సెటిలవుతుందా?

దిశా పటాని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గత ఏడాది ఒకే ఒక్క సినిమాతో వచ్చిన ఈ భామ ఈ ఏడాది కూడా ఒక సినిమాతోనే ప్రేక్షకులను అలరించనుంది. కానీ 2024 లో మాత్రం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్ కి కనువిందు చేస్తుంది. అది కూడా సౌత్ సినిమాల్లోనే కావడం విశేషం. అయితే దిశా పటాని ముందుగా ఇంట్రడ్యూస్ అయింది కూడా సౌత్ లోనే. అది కూడా తెలుగులో. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ తో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

అయితే ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెలుగులో గాని, ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. పూర్తిగా బాలీవుడ్ సినిమాలే చేసింది. అక్కడ MS ధోని, భాగి 2 మినహా పెద్దగా హిట్ సినిమాలు రాలేదు. అందుకేనేమో మళ్ళీ సౌత్ బాట పట్టింది. ఇక్కడ రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది ఈ భామ. ముందుగా తెలుగులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “కల్కి2898 AD” లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆ తర్వాత సూర్య హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం “కంగువ” లోను దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ రెండు సినిమాల్లోనే గాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోయే పాన్ ఇండియా చిత్రంలోనూ దిశాపటాని హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇలా వరుస సౌత్ సినిమాలు చేస్తున్న దిశా పటాని సౌత్ లోనే పాగా వేస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అదీగాక ఇప్ప్పుడు బాలీవుడ్ కంటే సౌత్ లోనే ఎక్కువ పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు