Dhruva nakshatram: ఈ రెండింటి కన్నా ఆ సినిమాపైనే ఆడియన్స్ మొగ్గు?

టాలీవుడ్ లో ఈ వారం రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ ఒకటి కాగా, మరొకటి శ్రీకాంత్, రాహుల్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన కోట బొమ్మాలిps ఒకటి. నవంబర్ 24న ఈ రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ రెండు సినిమాలపై సరైన బజ్ లేదు.

అయితే కోట బొమ్మాలి తమిళ్ సినిమా రీమేక్ కాగా, కేవలం లింగిడి సాంగ్ తో జనాల్లోకి వచ్చింది ఈ సినిమా, పైగా అల్లు అర్జున్ బ్యాక్ సపోర్ట్ తో రిలీజ్ అవుతున్నా కూడా మౌత్ టాక్ పైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇక ఆదికేశవ గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. ఈ సినిమా చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తుండగా, భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆదికేశవ సినిమా టీజర్, ట్రైలర్ తో సహా దీనిపైనా ఆసక్తి కలగలేదు. అందుకే ఈ సినిమా పై కామన్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

అయితే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల కన్నా ఓ డబ్బింగ్ సినిమాపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాయే చియాన్ విక్రమ్ నటించిన “ధ్రువ నక్షత్రం”. ఈ సినిమా గత ఆరేళ్ళు గా రిలీజ్ కి నోచుకోలేదు. కాని అన్ని ఫైనాన్షియల్ అడ్డంకులు తొలగించుకొని నవంబర్ 24న రిలీజ్ అవుతుంది. మొదట ఈ సినిమాపై కూడా బజ్ లేకపోగా, రిలీజ్ చేసిన టీజర్, ఇంకా ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాకే మొగ్గు చూపిస్తున్నారు.

- Advertisement -

అయితే ధ్రువ నక్షత్రం ట్రైలర్ మరీ కొత్తగా లేకపోయినా, కోట బొమ్మాళీ, ఆది కేశవ కంటే బెటర్ గా ఉంది. పైగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ ఈ సినిమాకి ప్లస్ అవనుంది. మరి రేపు రిలీజ్ అవుతున్న ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందో, ఆడియన్స్ ఏ సినిమాకి మొగ్గు చూపుతారో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు