Business Man : రీల్ కాదు.. రియల్ ?

టాలీవుడ్ అగ్ర హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు. సూపర్ స్టార్ సినిమా వచ్చిందంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. మహేష్ తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వం చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ప్రిన్స్ మహేష్ బాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.

తాజా న్యూస్ ఏమిటంటే మహేష్ బాబు ఫుడ్ వ్యాపారం లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారట. మంచి రెస్టారెంట్ ను స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాదులో చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ ‘మినర్వా’ తో కలిసి ఓ లగ్జరీ రెస్టారెంట్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తారని బోగట్టా.

సినిమా నటులు అంత ఏదో రకమైన ఇన్వెస్ట్ మెంట్ చేస్తూనే ఉంటారు. నాగార్జున ఇలాంటి వాటిలో ముందు ఉంటారు. మిగిలిన వారంతా భూముల మీదే పెడతారు. కమర్షియల్ కాంప్లెక్స్ లు కొంటారు. ఈ తరుణంలోనే ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ కొత్త వ్యాపారం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు