Ranbeer kapoor : బాలీవుడ్ రామాయణం కాస్టింగ్ పూర్తి.. ఆరోజే ముహూర్తం..?

బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ ఆది పురుష్ వచ్చినప్పటినుండి మరో రామాయణ్ వస్తుందని వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. 500 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని వార్తలు అప్పటినుండే వస్తుండగా, తాజాగా ఆ సినిమా గురించి మరింత సమాచారం వచ్చింది. బాలీవుడ్ రామాయణం కోసం ఆ మూవీ యూనిట్ భారీ త్రయం కోసం ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ స్టార్స్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటించనున్నట్లు, సాయి పల్లవి సీతగా కనిపించనున్నట్లు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు తెలిసిందే. అలాగే రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటించనున్నట్టు చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.

రెండో భాగాల్లో రామాయాణం..
రామాయణ ఇతిహాసాన్ని ప్రేక్షకులకు రెండు భాగాలుగా చూపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో రామాయణం యొక్క మొదటి భాగం 2025 దీపావళి విడుదలను లక్ష్యంగా చేసుకుని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే దీని గురించి అఫిషియల్ గా అధికారిక ప్రకటన ఏప్రిల్ 17న రాబోతోంది. ఇక రెండో భాగం మొదటిభాగం పూర్తయ్యాకే దాని ప్రస్తావన ఉండే అవకాశం ఉంది.

పాన్ ఇండియా కాస్టింగ్ :

- Advertisement -

ఇక ఈ బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ని నితీష్ తివారి నిర్మిస్తుండగా, ఈ సినిమాలో భారీ తారాగణం నటించబోతున్నారని బాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్స్ ని తీసుకోనున్నారని తెలుస్తుంది. ఇక మాకందిన సమచారం ప్రకారం ఈ సినిమాలో పాత్రల వారీగా నటీనటుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీత గా సాయి పల్లవి నటించనుందని తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం, ‘హనుమంతుని’ పాత్ర కోసం సన్నీ డియోల్ సెలెక్ట్ అయ్యాడట. అయితే ఇదే పనిగా అతని తమ్ముడు అనిమల్ విలన్ బాబీ డియోల్ ‘కుంభకర్ణ’ గా కనిపించనున్నారు. ఇక శూర్పణక పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తుందని మరియు కైకేయి పాత్రలో లారా దత్తా అంగీకరించారని సమాచారం. రావణాసురుని పాత్రను యష్ పోషించనున్నారు. వీళ్ళే గాక పరశురాముడిగా స్పెషల్ అప్పీరెన్స్ ప్రభాస్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్యాస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

శ్రీరామ నవమి కల్లా క్లారిటీ..

రామాయణ మొదటి భాగం మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇక నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకుడు. నితీష్ తివారీ మరియు రామాయణం మూవీ టీం ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి, మూవీ క్యాస్టింగ్, ఇంకా టెక్నికల్ టీం కి సంబంధించిన వార్తలు సంచలనంగా మారాయి. అయితే ఆది పురుష్ తో ఓసారి విమర్శలపాలైన బాలీవుడ్ రాబోయే ఈ చిత్రం లో ఏమాత్రం పొరపాటు చేసినా దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు