Mammootty : “భ్రమయుగం” మూవీ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక అలా చూడాల్సిందే!

మలయాళ స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడిగా పేరొందిన ఈయన ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతారు. ఒక్క మళయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న మమ్ముట్టి, రీసెంట్ గా చేసిన సినిమాలు మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. అందుకే స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటించిన సినిమా “భ్రమ యుగం”.

థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంతో పాటు పాన్ ఇండియా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ తెలిసేలా బ్లాక్ అండ్ వైట్ లో టీజర్ ని రిలీజ్ చేశారన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లోనే రిలీజ్ చేస్తున్నారా లేక మరి సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగానే రిలీజ్ చేస్తున్నారా, లేదా ట్రైలర్ లో మాత్రమే అలా చూపించారా అని నెటిజన్లు భావించారు. ఈ అనుమానాలన్నిటికి తేరా దించుతూ మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చారు.

భ్రమయుగం సినిమాని కేవలం బ్లాక్ అండ్ వైట్ లోనే రిలీజ్ చేస్తున్నామని, అది ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరెన్సు ని ఇస్తుంది అని మేకర్స్ తెలియచేసారు. ఎప్పుడో 30 ఏళ్ళ కింద బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఆగిపోయాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో సినిమా వస్తుందంటే ఆ అనుభూతిని థియేటర్లోనే ఆస్వాదించాలని ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భ్రమ యుగం సినిమాని “నైట్ షిఫ్ట్ స్టూడియోస్”, వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లో చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ కలిసి నిర్మించారు. ఇక ఫిబ్రవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు