Balayya:టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో.. బాలయ్యకు జోడిగా ఆ హీరోయిన్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే కార్యక్రమం ప్రస్తుతం మూడవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటిదాకా టాలీవుడ్ హీరోలతో ఆన్ స్టాపబుల్ టాక్ షో నిర్వహించిన బాలకృష్ణ.. ఈసారి బాలీవుడ్ వైపు కన్నేశారు. ఇటీవల ఈ మూడవ సీజన్ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుని యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.

దీనికి ఓ కారణం బాలయ్య అయితే.. మరో కారణం షో కి గెస్టులు. ఈ మొదటి ఎపిసోడ్ కి గెస్ట్లుగా వచ్చింది ఎవరంటే యానిమల్ చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న. ఈ ఎపిసోడ్ లో బాలయ్య తనదైన శైలిలో హుషారుగా ప్రశ్నలు అడుగుతూ, గెస్ట్ ల గురించి గొప్పగా చెబుతూ స్టేజి మీద స్టెప్పులు కూడా వేయించారు. మరోపక్క రష్మికతో సరదా సంభాషణలు చేశారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఆమెని విజయ్ దేవరకొండ కి కాల్ చేయమనగా ఆమె కాల్ చేసింది.

దీంతో ఈ ఎపిసోడ్ లో విజయ్ తో రష్మిక ఏం మాట్లాడారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే కాకుండా ఈ షోలో బాలయ్య రష్మికను ఇంట్రడ్యూస్ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ” నా మైండ్ బ్యాలెన్స్ లో లేదిక, ఎందుకో ఈ తికమక, ఇక వచ్చేయమ్మా రష్మిక” అంటూ బాలయ్య ఇచ్చిన ఇంట్రో రష్మిక అభిమానులను ఇంప్రెస్ చేసింది. అంతేకాకుండా బాలయ్య రష్మికకు ఐ లవ్ యు చెప్పడం వంటి మూమెంట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో సిల్వర్ స్క్రీన్ పై వీరిద్దరూ కలిసి నటిస్తే అదిరిపోతుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు