Ranga Maarthaanda: డిజిటల్ పార్ట్‌నర్ ఫిక్స్..

మురారి, చందమామ, ఖడ్గం, రాఖీ వంటి ఎన్నో హిట్ మూవీస్ కి దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశి, చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ ఒక కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరే రంగమార్తాండ. ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం మరియు రమ్య కృష్ణ లాంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు వహిస్తున్నారు.

ఈ సినిమా ఇద్దరు రంగస్థల నటుల జీవితం పై తెరకెక్కనుంది. ఇందులో తల్లిదండ్రులు, పిల్లల ప్రేమ, ఆప్యాయత గురించి చూపించారు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇంకా ఈ మార్చి 22 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు పాజిటివ్ రివ్యూలు కూడా వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ గురించి ఒక అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. రంగమార్తాండ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ OTT ప్లాటుఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది అని తెలుస్తుంది. అయితే ఈ రంగమార్తాండ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు.. కానీ, డిజిటల్ పార్ట్ నర్ ను మాత్రం ముందే ఫిక్స్ చేసుకుంది.

- Advertisement -

అయితే, ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీలో కంటే.. థియేటర్స్ లోనే చూడాలని, మంచి సినిమా అని, ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని ప్రీమియర్స్ చూసిన సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. మరి ప్రిమియర్స్ తో మంచి టాక్ తెచ్చుకున్న రంగమార్తాండ థియేటర్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు