Varalakshmi: తమిళంలో ఛాన్సులు రావట్లేదు

వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫిమేల్ విలన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు వరలక్ష్మి. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. పందెంకోడి, సర్కార్ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలలో విలన్ గా మెప్పించినప్పటికీ.. క్రాక్ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.

ఈ చిత్రంలో జయమ్మ పాత్రతో అందరినీ మెప్పించింది. కాగా వరలక్ష్మి తాజాగా నటించిన కోలీవుడ్ చిత్రం కోండ్రాల్ పావమ్ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఆ కరాళా రాత్రి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. అంతేకాదు ఈ చిత్రం తెలుగులో అనగనగా ఓ అతిధి అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే వరలక్ష్మి నటించిన కొండ్రాల్ పాపమ్ విడుదలైన తొలి రోజు నుంచే నెగిటివ్ రివ్యూస్ ను అందుకుంది. దీంతో విమర్శకులపై తనదైన శైలిలో ఫైర్ అయింది వరలక్ష్మి. చాలా గ్యాప్ తర్వాత తమిళంలో కధానాయికగా నటిస్తున్నానని తెలిపింది వరలక్ష్మి. అయితే తమిళంలో తనకు అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. 2011లో పోడా పోడి చిత్రం ద్వారా తమిళంలో పరిచయం అయ్యానని, అప్పటినుంచి 9 ఏళ్లపాటు ఇక్కడ రాణించిన రాలేని గుర్తింపు తెలుగులో వచ్చింది అని చెప్పారు.

- Advertisement -

కొత్త సినిమాలు విడుదలైన వెంటనే కొంతమంది సోషల్ మీడియాలో అదే పనిగా రివ్యూలు రాస్తుంటారు అని, ఏది మంచిదో, ఏది కాదో చెబుతుంటారని.. ఇలాంటివి ఆగాలని అన్నారు. ఎందుకంటే అవి సినిమా ఇమేజ్ ను దెబ్బతీస్తాయి అన్నారు వరలక్ష్మి. సినిమాలకు రివ్యూ ఇవ్వాలంటే వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఉండాలని సూచించింది. అర్థం పర్థం లేని రివ్యూలతో ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు