Veera Simha Reddy : ఓటీటీ రిలీజ్ అప్పుడే

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి థియేటర్లలో హంగామా మొదలైంది.

థియేటర్ల వద్ద అభిమానులు కోలాహాలం మామూలుగా లేదు. భాగ్యనగరం లో పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ఇప్పటికే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. వీరసింహారెడ్డి సినిమాకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ ను కూడా రివీల్ చేసింది మూవీ యూనిట్.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పెద్ద మొత్తం చెల్లించి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సినిమా ఓపెనింగ్ క్రెడిట్ సమయంలో వెల్లడించారు. ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో రాబోతుందన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలుస్తోంది. కాగా ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తున్న వీరసింహా రెడ్డి ఓటీటీలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా రికార్డులు నమోదు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు