దేవకట్టా దర్శకత్వంలో సాయి ధర్మతేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్” సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఆ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలోనే ఒక ఊహించని సంఘటన వలన సాయి తేజ్ కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజులుకు కోలుకున్న తరువాత సాయి తేజ్ పలు ఆసక్తికర సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.
ప్రస్తుతం సాయి తేజ్ చేస్తున్న చిత్రం “విరూపాక్ష” సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే డిఫరెంట్ టైటిల్ ను పెట్టారు.
అజ్ఞానం భయానికి మూలం
భయం మూఢనమ్మకానికి కారణం
ఆ నమ్మకమే నిజమైనప్పుడు
ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు
అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం అని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ ఈ గింప్ల్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుంది.
పాన్ ఇండియా దర్శకులు సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.‘విరూపాక్ష’ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నా
ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పాన్ ఇండియా రేజ్ లో రిలీజ్ కానుంది.