Sukumar : లెక్కల మాస్టారు శిష్యుల్లో ఏడో వాడు రెడీ..

Sukumar : టాలీవుడ్ లో క్రియేటివ్ జీనియస్ గా, లెక్కల మాస్టారుగా ఫేమస్ అయిన దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన ఈయన రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి దర్శకుల తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దర్శకుడీయన. ఇప్పుడు వాళ్ళని మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాడని చెప్పొచ్చు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆర్య సినిమాతో తెలుగు చిత్రసీమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ బడా టెక్నిషియన్స్ దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఆరేళ్ల కింద వచ్చిన రంగస్థలం తో సుకుమార్ టాలీవుడ్ లో ఓ రేంజ్ సంచలనం సృష్టించగా, మూడేళ్ళ కింద పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక త్వరలో పుష్ప-2తో పెను సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు.

సుకుమార్ బాటలోనే శిష్యులు కూడా..

ఇక దర్శకుడు సుకుమార్‌(Sukumar) లాగానే ఆయన శిష్యులు కూడా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్‌ డూపర్‌ హిట్లను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో రాఘవేంద్ర రావు శిష్యుల తర్వాత, ఎక్కువ సక్సెస్ అయింది సుకుమార్ శిష్యులే అని అంటున్నారు సినీ ప్రేక్షకులు. సుకుమార్ లాగే ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించి గురువుకు తగ్గ శిష్యులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక లాస్ట్ ఇయర్ నానితో దసరా మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల, అలాగే మూడేళ్ళ కింద ఉప్పెన హిట్ తో నేషనల్ అవార్డు అందుకున్న బుచ్చిబాబు సనా, విరూపాక్షతో అదిరిపోయే హిట్ కొట్టిన కార్తీక్ వర్మ దండు, వీళ్ళందరూ సుక్కూ శిష్యులే కావడం విశేషం. ఈ ముగ్గురే కాకుండా కరెంట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన పల్నాటి సూర్య ప్రతాప్‌, జక్కా హరి ప్రసాద్‌ తో పాటు ఎంతో మంది సుక్కూ శిష్యులు ఇండస్ట్రీలో రానిస్తున్నారు. సుకుమార్‌ దగ్గర శిష్యరికం పొంది, గురువు లాగే ప్రతిభావంతులైన దర్శకులుగా పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా సుకుమార్ మరో శిష్యుడు టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం కానున్నారని సమాచారం.

శ్రీ విష్ణు సినిమాకి దర్శకుడిగా సుకుమార్ శిష్యుడు..

శ్రీవిష్ణు హీరోగా గుఱ్ఱం సందీప్ నిర్మించబోయే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి సుక్కూ స్టూడెంట్ హుస్సేన్ షా కిరణ్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీవిష్ణు, రెబా మోనికా లాస్ట్ ఇయర్ సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టగా, మళ్లీ ఈ సినిమా కోసం వీరిద్దరూ జతకట్టారు. ఇక సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ ఇంతకు ముందు ‘అనగనగా’ అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించగా లాక్ డౌన్ లో రిలీజ్ అయి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు శ్రీ విష్ణు సినిమాతో పూర్తి స్థాయి సినిమా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి సుకుమార్ శిష్యుల్లా ఇతడు కూడా ఫస్ట్ సినిమాతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు