Spirit Movie Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన కీర్తి.?

Spirit Movie Update : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే వాళ్ల కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని మించి వారి కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాలు అందరూ హీరోయిన్స్ కి పడవు. కొంతమందికి మాత్రమే అటువంటి అదృష్టం దక్కుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన నేను శైలజ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు కీర్తి సురేష్ కి లభించాయి. పవన్ కళ్యాణ్ లాంటి హీరో సరసన కూడా నటించే అవకాశం దక్కింది. అయితే కీర్తి సురేష్ కెరియర్ లో ఎప్పటికీ ఒక మైలురాయిలా గుర్తుండిపోయే సినిమా అంటే మహానటి అని చెప్పొచ్చు. సావిత్రి బయోపిక్ లో అలా ఒదిగిపోయింది కీర్తి సురేష్. మొదట సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ఏం సరిపోతుంది అనుకున్న వాళ్లంతా కీర్తి నటన చూసి ఆశ్చర్యపోయారు. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ స్థాయి ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది.

కీర్తి సురేష్ కి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఆ సినిమా నుంచి మొదలైంది అని చెప్పొచ్చు. అల్లరితనాన్ని ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా ఆ సినిమాలో పండించింది కీర్తి. ఆ సినిమా తర్వాత కీర్తిచేసిన చాలా సినిమాలకు ఆడియన్స్ మంచి ఓపెనింగ్స్ ను అందించారు. ఇకపోతే రీసెంట్ గా తెలుగులో కీర్తి సురేష్ హిట్ అందుకున్న సినిమా అంటే దసరా అని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.

- Advertisement -

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమాతో అద్భుతమైన హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత సలార్ సినిమా వరకు హిట్ లేని ప్రభాస్ సలార్ తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ ( Spirit Movie Update ) అనే సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.

మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అనిమల్ సినిమాతో అద్భుతమైన ఘనవిజయాన్ని సొంతం చేసుకుని దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లను బాక్స్ ఆఫీస్ వద్ద సాధించాడు. ఈ సినిమా బాలీవుడ్ లో సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన మొదటి సినిమాపై విమర్శలకు పెంచిన చాలామందికి ఈ సినిమాతో గట్టి సమాధానాన్ని ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. వీరిద్దరూ కలిసి ఇప్పుడు స్పిరిట్ కోసం పనిచేయనున్నారు.

అయితే తన సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇప్పటివరకు చేసిన రెండు సినిమాల్లో కూడా హీరోయిన్స్ కి కీలకమైన పాత్ర ఉంటుంది. ఇక ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమాకి కీర్తి సురేష్ ను సందీప్ రెడ్డివంగా అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే రష్మిక మందన్నా కూడా ప్రభాస్ సరసన కనిపిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఈ హీరోయిన్స్ ఇద్దరిలో ఈ సినిమాను ఎవరు చేసినా కూడా వారి కెరియర్ కి ఇది మరింత ప్లస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు