Prabhas: ఆదిపురుష్ అసలు రామాయణమే కాదు అసలు నిజం ఒప్పుకున్నా మూవీ టీం

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. సినిమా రిలీజ్ కి ముందు అంత ప్రశాంతంగా ఉండగా, రిలీజ్ తరువాత నుంచి రోజుకొక వివాదంతో చర్చలకు దారి తీస్తుంది. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరి నుంచి రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమాని తీస్తున్నాం అని చెప్పుకుంటూవచ్చిన మూవీ ఇప్పుడు సడన్ గా మాటా మార్చింది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ తో, ఇండియాలోనే మోస్ట్ ఎక్సపెన్సివ్ చిత్రంగా రూపొందించబడిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల దగ్గరి నుంచి నెగిటివ్ రివ్యూస్ అందుకుంటుంది.

సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులంత సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని మొత్తం చెడగొట్టారని. అసలు సినిమాలో రామాయణమే లేదని, అంతంత బడ్జెట్ పెట్టి, రామాయణం తీస్తున్నామని నమ్మించి, ఇలా మోసం చేస్తారా అని అందరు మూవీ టీం ని విమర్శిస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి, తెలియనట్టు సైలెంట్ గా ఉన్న మూవీ టీం. మొదటి సారి ఈ విషయంపై నోరు విప్పింది. ఆదిపురుష్ సినిమాకి రైటర్ గా పని చేసిన మనోజ్ ముంతషీర్ ఈ వివాదంపై స్పందిస్తూ. ఆదిపురుష్ సినిమా అసలు రామాయణం కదాని, మూలకథని రామాయణం నుంచి స్ఫూర్తి గా తీసుకున్నమని చెప్పడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

- Advertisement -

మొదటి నుంచి రామాయణం అని చెప్పి సినిమా తీసి, రిజల్ట్ వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవటంతో ప్లేట్ మార్చడంతో. ఆదిపురుష్ మూవీ టీం పై ప్రేక్షకులంత తీవ్రంగా మండి పడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు