మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో అద్భుతమైన నటన కనబరిచి ఆకట్టుకున్నాడు. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఆ సినిమా తరువాత ‘కొండపొలం’ సినిమా చేశాడు. ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తొలి సినిమాతో హిట్ కొట్టి ఆ తరువాత ఫ్లాప్ని చూసిన వైష్ణవ్ కాస్త గ్యాప్ తీసుకొని ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలవ్వడానికి ముందు ఫస్ట్లుక్, ట్రైలర్, పాటలతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మల మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ ఈ సినిమాకు ఇది ప్లస్ కాలేకపోయింది. దీంతో వైష్ణవ్ ఖాతాలో మరో ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు.
ఇది ఇలా ఉండగా ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. త్వరలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ రెడి అవుతోంది. అక్టోబర్ 5 లేదా అక్టోబర్ 7న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయనుంది. ఓటీటీలో అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి మరీ.