టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్. ఇందులో అనన్య పాండే హీరోయిన్ నటించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. అంచనాలన్నీ తలకిందులై ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది.
దేశవ్యాప్తంగా విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేస్తుందని ఆశించారు. కానీ సీన్ అంతా రివర్స్ అయిందనే చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా కథ, కథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.82.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రూ.85కోట్లు సాధించాల్సి ఉంది. కానీ లైగర్ చిత్రం కేవలం రూ.30 కోట్ల వరకు మాత్రమే షేర్ను కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రానికి రూ.55 కోట్ల వరకు భారీ నష్టాలు వచ్చాయట. అయితే హిందీలో ఈ చిత్రం ఎబో యావరేజ్గా నిలిచిందట. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం ఓటీటీలో సెప్టెంబర్ 22న విడుదలవ్వనుంది. ఓటీటీలో ఈ సినిమాను నెటిజన్లు చూస్తారో లేదో వేచి చూడాలి.