Liger : ఓటీటీలోకి డిజాస్టర్

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగ‌ర్‌. ఇందులో అన‌న్య పాండే హీరోయిన్ న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్టు 25న పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌లైంది. అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందులై ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

దేశ‌వ్యాప్తంగా విజ‌య్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగ‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజ్ లో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తుంద‌ని ఆశించారు. కానీ సీన్ అంతా రివర్స్ అయింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుంచే డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా క‌థ‌, క‌థ‌నాలు బ‌లంగా లేవ‌ని, చెత్త సినిమా అంటూ ప‌లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.82.15 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. రూ.85కోట్లు సాధించాల్సి ఉంది. కానీ లైగ‌ర్ చిత్రం కేవ‌లం రూ.30 కోట్ల వ‌ర‌కు మాత్రమే షేర్‌ను క‌లెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రానికి రూ.55 కోట్ల వ‌ర‌కు భారీ న‌ష్టాలు వ‌చ్చాయ‌ట‌. అయితే హిందీలో ఈ చిత్రం ఎబో యావ‌రేజ్‌గా నిలిచింద‌ట‌. ఈ చిత్రాన్ని క‌రణ్ జోహార్‌, ఛార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. ఇక ఈ చిత్రంలో ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం ఓటీటీలో సెప్టెంబ‌ర్ 22న విడుద‌ల‌వ్వ‌నుంది. ఓటీటీలో ఈ సినిమాను నెటిజ‌న్లు చూస్తారో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు