స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు ఆడియెన్స్కి దూరమై చాలా కాలమే అయింది. మళ్లీ పొన్నియిన్ సెల్వన్ -1 తో తెలుగు వెర్షన్ తో అలరించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా త్రిష ట్రెడిషనల్ లుక్లో దరర్శనం ఇస్తుంది. టాలీవుడ్లో కొన్ని సంవత్సరాల అగ్రహీరోయిన్గా వెలుగొందిన హీరోయిన్లలో త్రిష ఒకరు. దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించింది. ఐదారేండ్లు టాలీవుడ్కి దూరం అయింది.
మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రంతో మళ్లీ అలరించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. త్రిష ప్రమోషన్లలో పాల్గొంటూ ట్రెడిషనల్ లుక్ దర్శనం ఇస్తుంది. దీంతో అభిమానులు త్రిషను చూసి మంత్రముగ్దులవుతున్నారు.
తెలుగులో త్రిషకి సంబంధించినవి ఎలాంటి సినిమాలు రాకపోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. పీఎస్ 1తో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్1ను తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడలో విడుదల చేస్తున్నారు మణిరత్నం. మరోవైపు ఓవర్సీస్లో కూడా గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవ్వనుంది. తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుండడం విశేషం.