Itlu Maredumilli Prajaneekam : ఓటీటీ డేట్ ఫిక్స్

కామెడీ చిత్రాలతో కామెడీ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో అల్లరి నరేష్. ఆ మధ్యకాలంలో ఆయన చేసిన ఎంటర్టైనింగ్ మూవీస్ అన్ని డిజాస్టర్ అయ్యాయి. దాంతో నరేష్ తన రూట్ మార్చి సీరియస్ కాన్సెప్ట్ తో నాంది సినిమా చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి సీరియస్ కాన్సెప్ట్ తో చేసిన ప్రయత్నం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.

ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 25వ తేదీన విడుదలై మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమాలో నరేష్ ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అద్భుత నటనను కనబరిచాడు. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇదిలా ఉంటే థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. సినిమా విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా విడుదలవుతోంది. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు