Shah Rukh : మళ్లీ తీసుకువస్తారా ?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన మూవీ ” బ్రహ్మాస్త్ర”. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో విజువల్ వండర్ గా ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు మౌని రాయ్, డింపుల్ కపాడియా, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. దక్షిణాది రాష్ట్రాలలో దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీని సమర్పించారు. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో ఈ మూవీ విడుదలై.. భారీ వసూల్లను రాబట్టింది.

మొత్తం మూడు భాగాలుగా రూపొందనున్న బ్రహ్మాస్త్ర తొలి భాగం సెప్టెంబర్ 9న బాక్సాఫీసు వద్ద సందడి చేసింది. ఈ తొలిభాగం సినిమా 360 కోట్ల గ్రాస్ ని దాటేసింది. అయితే రెండవ భాగం బ్రహ్మాస్త్ర – దేవ్ సినిమా కోసం సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఒక పెద్ద స్టార్ కీలక పాత్ర పోషించడానికి బోర్డులోకి వస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. అయాన్ పాత్ర కోసం షారుఖ్ ఖాన్ ను ఎంపిక చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. కానీ షారుఖ్ ఖాన్ ఒక అతిధి పాత్రలో నటించడం జరిగింది. అయితే అతను మొదటి భాగంలో చంపబడ్డాడు. కానీ షారుఖ్ ఖాన్ ని మళ్ళీ సినిమాలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దాని గురించే అయాన్ ప్లాన్ చేస్తున్నాడని రణబీర్ చెప్పుకొచ్చాడు. దీంతో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో షారుఖ్ కనిపించడానికి అవకాశాలు కాస్త గట్టిగానే ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు