Mahabharata: రాజమౌళి కల కలగానే మిగిలిపోతుందా.?

ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమాను శిఖరం మీద కూర్చోబెట్టిన దిగ్గజ దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అంచలంచెలుగా తన స్థాయిని పెంచుకోవడంతోపాటు, సినిమా స్థాయిని కూడా పెంచుతూ తెలుగు సినిమాని ప్రపంచ సినిమా చరిత్రలో నిలబెట్టాడు అనడం అతిశయోక్తి కాదు.  ఆస్కారంటే మురిసిపోయే మనకు ఆస్కార్ అవార్డున సైతం వచ్చేలా కృషిచేసి దానిని సాధించారు.

కలలు  కనడం వేరు ఆ కలని వెండితెరపై చూపించడం వేరు. కలలు చాలామంది కంటారు.  కానీ ఆ కలలని కొంతమంది మాత్రమే వెండితెరపై ఆవిష్కరిస్తారు.  అలా ఆవిష్కరించిన వారిలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు.  బాహుబలి సినిమాతో తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి, ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎస్ఎస్ రాజమౌళిదే.

ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉంటుంది.  అలా ఎస్ఎస్ రాజమౌళి విషయానికి వస్తే మహాభారతాన్ని తాను తీయాలని, దానిని తీయడానికి చాలా శక్తి కావాలని, ఎప్పటికైనా అది తన డ్రీమ్ అని ఇదివరకే చాలా ఇంటర్వ్యూస్ లో రాజమౌళి చెబుతూ వచ్చారు.  ఇప్పుడు అదే మహాభారతం బాలీవుడ్లో ఒక మూడు పార్ట్స్ లో రానుంది.

- Advertisement -

“పర్వా” అనే పేరుతో ఈ మహాభారతం తెరకెక్కనుంది. ఈ మహాభారతాన్ని “వివేక్ రంజాన్  అగ్నిహోత్రి” మూడు భాగాలుగా తెరకెక్కించనున్నాడు . పల్లవి జోషి దీన్ని నిర్మిస్తున్నారు.  రాజమౌళి అనుకున్న ఈ మహాభారతం అనే కల ఇక్కడితో ఆగిపోతుందా, లేదంటే రాజమౌళి మహాభారతం కూడా ఉంటుందా.? అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు