SS Rajamouli: విక్టరీ వెంకటేష్ ని దారుణంగా మోసం చేసిన రాజమౌళి..!

టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ది ప్రత్యేకమైన పంధా. మంచి కథలకు పట్టం కడుతూ హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు అన్ని జానర్స్ ని టచ్ చేశాడు. సెంటిమెంట్, కామెడీ, మాస్, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ ఇలా అన్ని జాలర్స్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఈ విలక్షనీయతే అతడిని టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా నిలబెట్టింది. కొత్త దర్శకులు, పాతదర్శకులు అనే తేడా లేకుండా కథ నచ్చితే ఏ దర్శకుడితోనైనా సినిమాలు చేస్తుంటారు వెంకటేష్.

అందుకే 60 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటికీ ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేస్తారు. అయితే విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు నేటితరం టాప్ స్టార్ దర్శకులతో కలిసి పని చేయలేదు. ఇదంతా పక్కన పెడితే.. ఆధ్యాత్మికవేత్త, యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద బయోపిక్ విక్టరీ వెంకటేష్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాలలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేసినా భారీగానే చేయాలని వెంకటేష్ భావించారు. అందుకే ఈ ప్రాజెక్టుని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చేయాల్సిందిగా మగధీర సినిమా విడుదలైన కొత్తలో అడిగారట వెంకటేష్.

దీనికి రాజమౌళి కూడా ఓకే అంటూ ప్రామిస్ కూడా చేశారట. ఆ తరువాత మగధీర హిట్ కావడంతో ఆయన రేంజ్, క్రేజ్ రెండు మారిపోయాయి. ఆ తరువాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు రాజమౌళి. మగధీర తర్వాత బాహుబలి సిరీస్, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చేయడం, ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేయబోతుండడంతో ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లేనని డిసైడ్ అయ్యారు వెంకటేష్ ఫ్యాన్స్. ఇక వెంకటేష్ స్వామి వివేకానంద ప్రాజెక్టును రాజమౌళి మరిచిపోయారని.. వెంకటేష్ ని రాజమౌళి మోసం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఎప్పుడు ఖాళీ అవుతారో..? అసలు ఈ ప్రాజెక్టు వస్తుందో లేదో ఆ దేవుడికే తెలియాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు