S. S. Rajamouli: ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్న రాజమౌళి

S. S. Rajamouli

టాలీవుడ్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి తీసుకున్న ఒక కొత్త సరి నిర్ణయం తెలుగు ప్రేక్షకులందరిని షాక్ కు గురి చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచమంత తనవైపు చూసేలాగా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి ఒకపక్క దర్శకత్వం చేస్తూనే లేటెస్ట్ గా ఆయన ప్రొడ్యూసర్ గా కూడా మారాడు.

ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉంటోన్న రాజమౌళి ఇటీవలనే ఒక అద్భుతమైన కథ విన్నడట, అయితే ఆ కథ ఆయన రెగ్యులర్ గా తీసే సినిమాలలాగా ఫిక్షన్ కథ కాదు. అది సినీ రంగానికి సంబంధించి విశేష సేవలందించిన ఒక ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్ర అట. ఇక ఆ కథ విన్న వెంటనే రాజమౌళి ఆ సినిమాను ప్రేక్షకులకందించాలనే ఉద్దేశ్యంతో ప్రొడ్యూసర్ గా మారాడు. రాజమౌళి తనయుడు యస్ యస్ కార్తికేయ ఈ సినిమాకు సంబందించిన నిర్మాణ బాధ్యతలు చూసుకోనున్నాడు. “మేడ్ ఇన్ ఇండియా” అనే పేరుతో ఈ సినిమా రాబోతుంది. నితిన్ కక్కర్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

అయితే రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక రూమర్ నెట్ లో హల్చల్ చేస్తుంది అదేంటంటే ఈ మేడ్ ఇన్ ఇండియా సినిమా.. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే రాజమౌళి ఈ మూవీ ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఆయన ఎవరి బయోగ్రఫీ ఆధారంగా సినిమా చేస్తున్నారనే విషయాన్ని తెలియజేయకపోవటంతో ప్రేక్షకుల్లో ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. మరీ దీనిపై జక్కన్న ఎప్పుడు క్లారిటీ ఇస్తాడనేది వేచి చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు