Vishika Laxman: రచ్చ లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్!

Vishika Laxman:

టాలీవుడ్ లో ఎందరో చైల్డ్ ఆర్టిస్ట్ లు తెరపైకి వస్తుంటారు. అందులో కొందరు దశ తిరిగి ఇండస్ట్రీ లోనే నటులుగా ఎదుగుతారు. మరికొందరు ఈ ఫీల్డ్ లో సక్సెస్ కాలేక వదిలేస్తారు. ఇంకొందరు ఫ్యూచర్ లో అసలు సినిమా ఫీల్డ్ జోలికి పోనేపోరు. ఈ క్రమంలో కొందరు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా కూడా రాణించారు. అందులో ఆ నాటి కమల్ హాసన్ నుండి, నేటి తేజ సజ్జా వరకు చాలా మంది హీరోలు రాణించారు. అంత వరకు ఎందుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో కామెడీ పాత్రలు చేసిన మాస్టర్ భరత్ ఇప్పుడు నటుడిగా రాణిస్తున్నాడు.

ఇక ఫిమేల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్, అనికా, కావ్య, శ్రీ దివ్య స్టార్ హీరోయిన్లు అయ్యారు. ఇప్పుడు ఇదే కోవలోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ రచ్చ(2012) సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో తమన్నా పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ విషికా లక్ష్మణ్ పదేళ్ల తర్వాత ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. చిన్నప్పుడు తెల్లగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు ఎర్రగా మంచి రంగుతో తయారయ్యి అట్రాక్ట్ చేస్తుంది.

- Advertisement -

భరత్ బాడే హీరోగా టి. గంగాధర దర్శకత్వం లో వస్తున్న “ఏందిరా ఈ పంచాయితీ” అనే సినిమాలో హీరోయిన్ గా విషికా లక్ష్మణ్ హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. అయితే ఇంతకు ముందు ఈటీవీ లో ప్రసారమైన యమలీల అనే సీరియల్ లో కూడా నటించింది ఈ భామ. పలు ఓటిటి సినిమాలు కూడా చేసింది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నని రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని, కానీ రామ్ చరణ్ ని కలిసే అవకాశం రాలేదని అంది. ఎదో ఒకరోజు తనని ఖచ్చితంగా కలుస్తానని అంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు