Vijay Devarakonda : సమంత కోసం తగ్గారు

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రం “ఖుషి”. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ ఫిలిం “హృదయం” ఫేమ్ అబ్దుల్ వహీబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం రూపొందుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన సినిమా ‘ఖుషి’ టైటిల్ ని పెట్టడం ద్వారా ఈ పిక్చర్ పై అంచనాలు మ‌రింత పెరిగాయి. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు గతంలో చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు హీరో విజయ్ దేవరకొండ.

ఖుషి షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తి చేసుకుంది. కానీ విడుదల తేదీపై అనేక రకమైన చర్చలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ విడుదలపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల ఖుషిని డిసెంబర్ నెల‌లో విడుద‌ల‌ చేయలేకపోతున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల‌లో ఈ మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అయితే ఇటీవల సమంత అనారోగ్యం బారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఖుషి షూటింగ్ జరగడం లేదు. సమంత కొద్ది రోజుల రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటారు. దీని వల్లే విడుదల ఇంకో రెండు నెలలు ఆలస్యం కానున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా సమంత పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత న‌టిస్తున్న‌ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ అంచనాలు అందుకునేలా ఖుషి ఉంటుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు