అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షశివో’. యూత్ని ఎక్కువగా టార్గెట్గా చేసుకుని ఈ సినిమా దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించాడు. అల్లు శిరీష్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఈ సినిమాలో శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అలాగే మొదటి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు రావడంతో అల్లు శిరీష్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ముందుగా ఈ చిత్రానికి ప్రమోషన్ పనులు ఎక్కువగా జరగలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి నటసింహం బాలయ్య వచ్చిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా సినిమా విడుదలైన తర్వాత మంచి రివ్యూలు రావడంతో సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా, అల్లు శిరీష్ చిత్రానికి అన్న అల్లు అర్జున్ ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇతర కుర్ర హీరోల ఫంక్షన్ కు అల్లు అర్జున్ వెళ్లారు. కానీ సొంత తమ్ముడి సినిమాలో భాగం కాలేదు.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు శిరీష్ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను రంగంలోకి దింపాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకు మరింత మంచి పేరు తీసుకురావడానికి అల్లు అర్జున్ క్రేజ్ ను ఉపయోగించుకోవడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒక ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించి, దానికి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ ను పిలిచే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందనేది ముందు ముందు వేచి చూడాలి.