అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకి దర్శకురాలిగా పరిచమైన నందిని రెడ్డి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుంచి విలక్షణ దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. నాని, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా కేవలం 4కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 15 కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.కాగా ఈ సినిమాకి గాను నందిని రెడ్డి కి నంది అవార్డ్ కూడా వచ్చింది.
లేటెస్ట్ గా నందిని రెడ్డి, సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ గురువారం (మే18) సినిమా రిలీజ్ అవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వూ లో పాల్గొన్న ఆమె అన్నీ మంచి శకునములే సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేసింది.
అయితే ఆమె మొదటగా అన్నీ మంచి శకునములే సినిమా కథని ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న ఒక యంగ్ హీరోకి కథ వినిపించిందట, ఆ హీరోకి కూడా కథ నచ్చి ఒకే అని చెప్పాడంట, అయితే నందిని రెడ్డి కూడా ఇక స్క్రిప్ట్ పనులలో బిజీ అయిపోగానే ఆ గ్యాప్ లో ఆ యంగ్ హీరో సినిమా ఒకటి రిలీజై బ్లాక్ బస్టర్ అవడంతో, ఆ హీరో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోవడంతో . ఆ తరువాత అతనితో సినిమా చేయడం కుదరలేదు. అని చెబుతూ ఆ హీరో పేరు విజయ్ దేవరకొండ అని చెప్పింది.
విజయ్ దేవరకొండకి నందిని రెడ్డి అన్నీ మంచి శకునములే సినిమా కథని అర్జున్ రెడ్డి సినిమా ముందు చెప్పిందట కానీ అర్జున్ రెడ్డి హిట్ తో విజయ్ ఒక్కసారిగా పెద్ద హీరో అయ్యాడు. అందువల్ల చేయలేకపోయాను అని చెప్పింది. అలాగే సంతోష్ శోభన్ గురించి ఆమె మాట్లాడుతూ సినిమాలో సంతోష్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా యాక్ట్ చేసాడని. ఈ సినిమాతో సంతోష్ కి మంచి గుర్తింపు వస్తుందని ఆమె అభిప్రాయపడింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News