Varsham Re Release : నిన్ననే రిలీజ్ అయినట్లు ఉంది

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంది. దాదాపు 20 ఏళ్ల నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న త్రిష.. అనుకోకుండా సినిమాలకు దూరం అయింది. ఇక ఇటీవల ప్రముఖ తమిళ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్ర పోషించి తన నటనతో పాత్రకు జీవం పోసింది.

నాలుగు పదుల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత రెండు రోజుల క్రితం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా ఒకప్పటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం పలు థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. శోభన్ దర్శకత్వంలో ఈ మూవీని సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు భారీ స్థాయిలో నిర్మించారు.

ఈ మూవీని రీ రిలీజ్ చేయగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 18 ఏళ్ల తర్వాత రిలీజ్ కాగా సినిమాను చూడడానికి భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో దీనిపై త్రిష స్పందించింది. “నా తొలి తెలుగు సినిమా మళ్ళీ విడుదలైంది. కానీ నిన్ననే సినిమా రిలీజ్ అయినట్లు ఉంది. సినిమాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని నిరూపించారు. మీ అందరి వల్లే నేను ఇలా ఉన్నాను” అని ఇన్ స్టాగ్రామ్ లో త్రిష భావోద్వేగానికి గురైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు