Itlu Maredumilli Prajaneekam : యాక్షన్ ఎలిమెంట్స్ తో..

అల్లరి నరేష్ హీరోగా ఎఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ , థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతన్న ఈ చిత్రం ప్రారంభించిన నాటి నుంచి అంచనాలను పెంచుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ఒక రోజు ముందుగానే వచ్చింది. యశోద సినిమా థియేటర్ లలో ఉన్న సమయంలో ఈ ట్రైలర్ వచ్చింది. తాజాగా ఇప్పుడు యూట్యూబ్ లోకి చిత్ర యూనిట్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ట్రైలర్.. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో ఆసక్తిగా ఉంది. ట్రైలర్ ను గమనిస్తే.. హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా కనిపిస్తున్నారు.

ఒక మారుమూల గ్రామంలో ఎన్నికలు జరపడానికి వచ్చిన హీరో, అక్కడి కష్టాలను చూసి చలించిపోయి, ప్రజలు ఉన్నది ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే కాదు.. వారి హక్కులను కూడా సాధించుకోవాలని అక్కడే ఉండిపోతారు. ప్రభుత్వ అధికారులను అక్కడికి వచ్చేలా చేస్తాడు. ఈ క్రమంలో హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ ఊరి కనీస సదుపాయాలను కల్పించేలా చేశాడా లేదా అనేది స్టోరీ అన్నట్లు ఈ ట్రైలర్ తో తెలుస్తోంది.

- Advertisement -

అలాగే ట్రైలర్ లో ”ఇంకా నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ మీ ఊళ్లో జరగబోతున్నాయి” ”అయినా మీకు ఓటేస్తే సచ్చిపోయినోడు బతికస్తాడా సార్” ”అప్పుడు ఓటు వేయడం వల్ల వీరికి జరిగిన మంచి ఏంటి మాస్టారు” ”మన దేశం బాగుపడాలంటే మార్పు రెండు ఏరియాలలో జరిగాలి. ఒకటి రాజకీయ నాయకుల్లో.. రెండు ప్రభుత్వ ఉద్యోగుల్లో..” అంటూ వచ్చిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు