Varalakshmi SarathKumar: ఇంట్రెస్టింగ్ కామెంట్స్

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ “యశోద”. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీని యువ దర్శకులు హరీ, హరీష్ కలిసి సంయుక్తంగా తీశారు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్ని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రంలో నెగిటివ్ ఛాయలున్న పాత్రను పోషించానని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.

ఈ చిత్రం కోసం సమంత చాలా కష్టపడ్డారని.. సమంత తనకి 12 ఏళ్ల క్రితమే పరిచయమని చెప్పింది వరలక్ష్మి. “12 ఏళ్ల క్రితమే సమంతకి నాకు చెన్నైలో పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో నాకు సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేను షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని. షాట్ కి ముందే జోక్స్ ఎందుకు వేస్తావు అని సమంత నవ్వేది. సమంతతో నటించడం చాలా సరదాగా ఉంటుంది. ఆమె ఈ చిత్రంలో ఫుల్ రోల్ లో బాగా నటించింది. క్రాక్ సినిమాలో జయమ్మ తర్వాత నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నేను తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాను”. అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు