Varalakshmi Sarath Kumar: రిపోర్టర్ కి ఝలక్ ఇచ్చిన వరాలు.. అసలేమైందంటే..?

Varalakshmi Sarath Kumar.. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ లో విలన్ పాత్రలలో హీరోలకు దీటుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. శబరి అనే సినిమాలో తాజాగా ఈమె నటిస్తోంది. ఈ సినిమా మే 3వ తేదీన తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఇక కొత్త దర్శకుడు అనిల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే కొత్త నిర్మాత మహేంద్ర నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించింది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈ సందర్భంగా ఆమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని సంబోధించిన రిపోర్టర్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది..

రిపోర్టర్ కి కౌంటర్..

మీరు ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన వీర సింహారెడ్డి , హనుమాన్ , నాంది లాంటి సినిమాలు అంటూ రిపోర్టర్ ప్రస్తావిస్తుండగా.. అప్పటికే ఆగ్రహం చెందిన వరలక్ష్మి మధ్యలో మాట్లాడుతూ.. ఆ సినిమాలలో నేను చేసింది… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా? అంటూ ఆమె ప్రశ్నించారు.. వీరసింహారెడ్డి సినిమాలో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించానా ? అని అడిగితే.. మీరు చేసింది ఒక స్పెషల్ రోల్ కదా అని రిపోర్టర్ అన్నారు.. అంటే అది మీకు ఒక స్పెషల్ రోల్ అనిపించిందా ? అని మళ్లీ ఆమె ప్రశ్నించారు.. అంటే హీరో , హీరోయిన్ కాకుండా మిగతా పాత్రధారులను క్యారెక్టర్ ఆర్టిస్టులు గానే సంభోదిస్తాం కదా అంటూ రిపోర్టర్ అన్నారు.. దానికి ఈమె.. సరే హీరో హీరోయిన్లతో పోలిస్తే ఎవరి రోల్ ఎక్కువగా ఉంది అని డిగింది .హీరోయిన్ రోల్ కంటే మీదే ఎక్కువగా ఉందని రిపోర్టర్ సమాధానం ఇచ్చారు.. ఇక నాదే ఎక్కువ అంటే నేనే లీడ్ .. నా ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ తర్వాత నేనే లీడ్ అని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమాలో నేను బాలకృష్ణతో డాన్స్ చేయలేదు కాబట్టి మీరు నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అనుకుంటున్నారా అంటూ ఆమె మళ్ళీ ప్రశ్నించింది. అంతేకాదు నా ప్రకారం నేను సినిమాను మెయిన్ లీడ్ గానే పనిచేశాను అంటూ కూడా సమాధానం ఇచ్చింది వరలక్ష్మి ..మొత్తానికైతే తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు అని తనను అలా పిలిచిన రిపోర్టర్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..

వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్..

ఒకప్పుడు కోలీవుడ్లో వరుస సినిమాలలో హీరోయిన్గా చేసి ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈమె.. తర్వాత తన పాత్రను మార్చుకొని విలన్ గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ..అలా క్రాక్ సినిమాతో మొదలైన తన విలన్ కెరియర్ వరుస సినిమాలు చేస్తూ ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని చెప్పవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలకు లక్కీ లేడీగా కూడా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్.. ఈమె నటిస్తే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని నమ్మకం కూడా కామెంట్ రూపంలో వినిపిస్తూ ఉంటుంది . ప్రస్తుతం ఈమె నటిస్తున్న శబరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు