Varalakshmi: నన్ను చంపేస్తారని భయపడ్డాను

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వీర సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఫుల్ ఖుషి గా ఉన్న మూవీ యూనిట్ గత రాత్రి హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ హాజరయ్యారు. అయితే ఈ వేదికపై మాట్లాడిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో బాలయ్యతో ఓ సీన్ చేసేటప్పుడు ఆయన అభిమానులు గుర్తుకు వచ్చి చాలా భయపడ్డాను అని చెప్పుకొచ్చారు.

“సినిమాలో బాలయ్య ను పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడిపోయాను. ఆ సీన్ చూశాక బాలయ్య అభిమానులు నాపై పగ పెంచుకొని వచ్చి నన్ను చంపుతారేమోనని ఆందోళనకి గురయ్యాను. నేను అలా ఇబ్బంది పడుతుండగా చూసిన బాలయ్య నన్ను గమనించి.. నాలో ధైర్యం నింపారు. అభిమానులు ఆ సన్నివేశాన్ని నెగిటివ్ గా తీసుకోరని.. తన ఫ్యాన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటారని నాకు ధైర్యం చెప్పారు.

- Advertisement -

ఆయన చెప్పినట్టుగానే మీరందరూ ఆ సన్నివేశాన్ని రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని తెలిపింది వరలక్ష్మి. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్, అతనికి భార్యగా నటించిన వరలక్ష్మికి మంచి పేరు వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ ను విమర్శకులు సైతం ప్రశంసించారు అనే చెప్పాలి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో కెరీర్ లో దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు