AK62: సాయి పల్లవికి బంపర్ ఆఫర్

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ తమిళ భామ, తెలుగులోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా దక్కించుకుంది. సాయి పల్లవి నుంచి ఇటీవల వచ్చిన మూడు సినిమాలు శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి లో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ ఇందులో శ్యామ్ సింగ రాయ్ మినహా విరాట పర్వం, గార్గి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

ఇది ఇలా ఉండగా గార్గి తర్వాత సాయి పల్లవి సిల్వర్ స్క్రిన్ పై కనిపించలేదు. విరాట పర్వం, గార్గి కమర్షియల్ హిట్ కాకపోవడంతో అవకాశాలు తగ్గాయని కొంతమంది అంటున్నారు. కానీ, మరి కొందరు తమిళనాడులో సాయి పల్లవి ఓ ఆస్పత్రి నిర్మిస్తోందని, అందుకే నటనకు కొంత బ్రేక్ వేసిందని అంటున్నారు. కాగా సాయి పల్లవి నటి కాక ముందు ఎంబీబీఎస్ చదివిన సంగతి విధితమే. అయితే ప్రస్తుతం ఈ లేడీ పవర్ స్టార్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో, కోలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.

అజిత్ కుమార్ తర్వాత సినిమాలో సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తుందట. తునీవు తర్వాత అజిత్ కుమార్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో AK62 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి గత కొద్ది రోజుల నుంచి అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నయనతార, ఐశ్వర్య రాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారా. లేదా సాయి పల్లవి గెస్ట్ పాత్రలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు