Nayanathara : ‘కనెక్ట్’ అవుతారా ?

నయనతార.. సౌత్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు, తమిళ, మలయాళంలో అత్యంత పారితోషకం తీసుకుంటుంది నయన్ మాత్రమే. తన నటనతో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటుంది ఈ లేడీ సూపర్ స్టార్. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం జోష్ తగ్గనివ్వట్లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి నయన్ పెట్టంది పేరు.

అవకాశం వచ్చిన ప్రతీ సినిమాకి సైన్ చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ‘కనెక్ట్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విగ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ ‘రౌడీ పిక్చర్స్’ లో నిర్మిస్తున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రానికి భూమిక ఫేమ్ పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం, మణికంఠన్ రామాచారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

ఇటీవలే నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే.. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న థియేటర్ లో సందడి చేయనుంది. తాజాగా ఈచిత్రం సెన్సార్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ లో సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

- Advertisement -

అలాగే ఈ సినిమా నిడివి 99 నిమిషాలు ఉండబోతుంది. ఇంటర్వెల్ లేకుండా రాబోతున్న మొదటి తమిళ చిత్రమని నిర్మాత విఘ్నేష్ శివన్ వెల్లడించాడు. ఏకధాటిగా 1:39 గంటల పాటు సినిమా చూడటం కష్టమే. కానీ మేకర్స్ ఇంటర్వేల్ కు కూడా ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్నారంటే.. సినిమాలో హర్రర్ ఎలిమేంట్స్ కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది.

అంతలా హోప్స్ పెట్టుకున్న మేకర్స్ ను ప్రేక్షకులకు కనెక్ట్ ఎంత వరకు మెప్పిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు