Siddu Jonnalagadda: టిల్లుగాని మనసు విరిగినట్టుంది.. అందుకే అప్పుడే వస్తా అంటుండు!

టాలీవుడ్ లాస్ట్ ఇయర్ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కి చిన్న సినిమాగా రిలీజ్ అయిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్ధూ జొన్నలగడ్డ కి డీజే టిల్లు గా సూపర్ ఆటిట్యూడ్ యాక్టింగ్ తో, తన కామెడీ తో మెప్పించడమే కాకుండా, యూత్ లో మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కూడా హీరో రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ కూడా వస్తుందని తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, పెద్ద సినిమాల వల్ల సెప్టెంబర్ కి పోస్టుపోన్ అయ్యింది. అయితే ఆ నెలలో కూడా కొన్ని సినిమాల పోటీ ఉండడంతో టిల్లు ప్రొడ్యూసర్ ఏకంగా ఫిబ్రవరి కి తీసుకెళ్లాడు. తాజాగా నిర్మాత నాగవంశీ డీజే టిల్లు 2024 ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసారు.

ఇక డీజే టిల్లు కూడా అప్పట్లో వాయిదా పడే ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. అయితే టిల్లు స్క్వేర్ పై టాలీవుడ్ లో క్రేజీ బజ్ ఉంది. అందుకే వాయిదా పడ్డ మేకర్స్ కంగారుపడట్లేదు, ఎప్పుడు వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు పిండుకోడానికే అన్నట్టు వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు