Krishna: ప్రొడ్యూసర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

సూపర్ స్టార్ కృష్ణ నటించిన క్లాసిక్ సినిమా “మోసగాళ్లకు మోసగాడు” ఆయన జయంతి సందర్బంగా మే 21న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రీ రిలీజ్ ట్రెండ్ మొదలయినప్పటి నుండి రిలీజ్ అయినా సినిమాలన్ని ఇప్పటి స్టార్ హీరోల సినిమాలే కావడం గమనార్హం. ఎందుకంటే రిలీజ్ అయిన సినిమాలన్ని ఆయా హీరోల కెరీర్ బిగినింగ్ లో బిగ్గెస్ట్ హిట్స్ కాగా, ఆ హీరోలందరూ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. కాబట్టి వారి ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందువల్ల ఆ హీరోలు గతంలో నటించిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేస్తే కామన్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోకపోయినా అభిమానులు మాత్రం చూస్తారు.

మధ్యలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు కూడా విడుదల అయ్యాయి. పైగా వారు ఇప్పటికి స్టార్లు గా యంగ్ జెనరేషన్ కి పోటీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే మాదిరిగా అలనాటి సూపర్ స్టార్ కృష్ణ సినిమా మోసగాళ్లకు మోసగాడు సినిమాను ఆయన అన్న, చిత్ర నిర్మాత అయిన ఆదిశేషగిరిరావు రీ రిలీజ్ చేస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసారు. అయితే ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలన్ని ఆ హీరోలు ఫామ్ లో ఉండగా వచ్చినవే. కాబట్టి ఫ్యాన్స్ కూడా పనిగట్టుకుని మరీ చూసారు. మరి మొదటి తరం హీరో అయిన కృష్ణ సినిమా ఎవరు చూస్తారని నెటిజన్స్ మనసులో సందేహం ఉండేది. ఆ సినిమా మహేష్ బాబు సినిమా కూడా కాదు. అయితే ఇక్కడే నిర్మాత ప్లానింగ్ అర్ధమైపోయివుండాలి.

వివరంగా చెప్పాలంటే మే31 న కృష్ణ జయంతి సందర్బంగా మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన టీజర్ గాని, ట్రైలర్ గాని ఎదో ఒక అప్ డేట్ వాస్తు ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కృష్ణ జయంతి రోజున మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నారు. అయితే ఈ టీజర్ ను మోసగాళ్లకు మోసగాడు ప్రదర్శించే థియేటర్లలో ప్లే చేస్తున్నామని మేకర్స్ తెలియచేసారు. అప్పుడు టీజర్ కోసమైనా అభిమానులు ఆ థియేటర్లకు వస్తారని నిర్మాత ఆలోచించారని అనిపిస్తుంది. తక్కువ థియేటర్లలో అయినా ఈ సినిమా హౌస్ ఫుల్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు