OM Bheem Bush : జాతిరత్నాలు రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు..

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “ఓం భీం బుష్”. హుషారు తో మంచి హిట్టు కొట్టిన హర్ష కొనుగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచుకుంటుంది. టీజర్ ని చూస్తుంటే ఒక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక టీజర్ లో అక్కడక్కడా వేసిన పంచులు కూడా చాలా హిలేరియస్ గా ఉన్నాయి. సినిమా మినిమం గ్యారెంటీ కామెడీ చిత్రాల ఆడియన్స్ ని మెప్పించడం అయితే గ్యారెంటీ అనిపిస్తుంది.

ఇక తన సినిమాలతో మినిమం గ్యారెంటీ అంటూ మెప్పిస్తున్న శ్రీవిష్ణు సామజవరగమన తర్వాత చేస్తున్న మూవీ అవడంతో ఓం భీం బుష్ సినిమాపై క్రేజీ బజ్ ఏర్పడింది. ఇక ఈ టీజర్ లాంచ్ లో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా కథ వినగానే మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ అని మా మార్కెట్ రేంజ్ అన్ని పక్కన బెట్టి సినిమా చేసాము, ఆ తర్వాత ఒక్కొక్కరుగా ప్రియదర్శి, రాహుల్ యాడ్ అవుతుంటే సినిమా రేంజ్ మారిపోయింది. ఇప్పడు డబ్బింగ్ స్టేజ్ లో ఉన్నాం.. నాకు తెలిసి ఈ సినిమా మా అందరి కెరీర్ లో బిగ్గెస్ట్ సెన్సేషనల్ అవ్వబోతుంది అన్నాడు.

ఇక ఈ మాటల్ని వింటుంటే సోషల్ మీడియా లో ఈ సినిమా మరో జాతిరత్నాలు అవ్వబోతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీజర్ కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. పైగా శ్రీ విష్ణు, రాహుల్, ప్రియదర్శి ఈ ముగ్గురి కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి సినిమా కంటెంట్ బాగుంటే ‘ఓం భీం బుష్’ మండు వేసవిలో చల్లని చిరునవ్వులు కురిపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మార్చి 22న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ లో సునీల్ బలుసు నిర్మిస్తున్నాడు. అయేషా ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు