Yaatra2 : పెట్టింది ‘యాభై’.. వచ్చింది సున్నా?

టాలీవుడ్ లో గత మూడు వారాల కింద రిలీజ్ అయిన సినిమా యాత్ర2. ఈ సినిమా యాత్ర కి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. దివంగత సీఎం వైయస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర తెరకెక్కగా, దానికి సీక్వెల్ గా వైయస్ జగన్ ని కూడా లింక్ చేస్తూ యాత్ర 2 ను తెరకెక్కించారు. ఈ సీక్వెల్ లో కూడా వైఎస్సార్ పాత్ర కాసేపు ఉంటుంది. మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మమ్ముట్టి వై యస్ రాజశేఖర్ రెడ్డి గా నటించగా, జీవా జగన్మోహన్ రెడ్డిగా నటించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 8న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకోగా ఓపెనింగ్స్ మాత్రం దారుణంగా వచ్చాయి.

ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి జరిగిన బిజినెస్ కి, వచ్చిన కలెక్షన్స్ కి అసలు పోలికే లేకుండా పోయింది. పైగా కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం తీసిన సినిమా కాబట్టి ఈ సినిమాకు ఒక వర్గం ఆడియన్స్ మాత్రమే థియేటర్లకు రావడం జరిగింది. అది కూడా రిలీజ్ రోజు మాత్రమే. ఆ తరువాత రోజు నుండి మాత్రం చాలా థియేటర్లు ఖాళీ అయిపోయాయి. థియేటర్లో పట్టుమని పదిమంది కూడా లేక మూతపడ్డాయి. అలాంటి ఈ సినిమా బడ్జెట్ పరంగా ఎంతో గ్రాండియర్ గా తెరకెక్కింది. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారట. అయితే అందులో చాలా వరకు మమ్మూట్టి, జీవా తో పాటు డైరెక్టర్ మహి వి రాఘవ రెమ్యూనరేషన్స్ కే బడ్జెట్ లో సగం పోతుంది.

అయితే మిగిలిన బడ్జెట్ తో సినిమా తీయగా, కొన్ని సార్లు అవుట్ డోర్ షూటింగ్ జరిగినపుడు జూనియర్ ఆర్టిస్టుల ఖర్చు కూడా జగన్ సర్కారు కార్యకర్తలు పెట్టుకున్నారట. ఏది ఏమైనా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన యాత్ర 2 ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల బిజినెస్ కి వరల్డ్ వైడ్ గా కేవలం 3.70 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. అంటే పెట్టుబడిలో కనీసం అయిదు శాతం కూడా వసూలు చేయలేదు. ఇక వచ్చిన వసూళ్ళలో కూడా థియేటర్ల ప్రమోషన్ల ఖర్చులు తీసేస్తే సినిమాకి దాదాపు 0 షేర్ వచ్చినట్టే అని నెటిజన్లు అంటున్నారు. ఇలా లేనివి ఉన్నట్టు, జరగంది జరిగినట్టు, కల్పించి తీస్తే ఏ సినిమా అయినా ఇలాగే డిజాస్టర్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు