Thiruchitrambalam: ధనుష్ పై కరీనా కపూర్ ప్రశంసలు

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కరీనా కపూర్ దక్షిణ భారత నటుడు ధనుష్‌పై ప్రశంసలు కురిపించారు. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ ప్రసారం ప్రశంసలు అందుకుంది. ‘ది గ్రే మ్యాన్’ గత నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. ధనుష్ పాత్రకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రానికి రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించారు.

కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ధనుష్, అతనో అద్భుతమైన నటుడు. నేను అతనిని ప్రతిసారీ ఏ పాత్రలో చూసినా, అతను మరియు అతని పెర్ఫార్మెన్స్ వేరే స్థాయిలో ఉంటాయి. అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరీనా కపూర్ ‘లాల్ సింగ్ చద్దా’ లో నటించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇకపోతే ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తిరు చిత్రంబలం’. ఈ చిత్రానికి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష భరత్, శ్రేయాస్ శ్రీనివాసన్‌లతో కలిసి మిత్రన్ జవహర్ స్వయంగా స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. ఆగస్ట్ 18న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్ రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు