Bollywood: సంచలనం సృష్టిస్తున్న ది కేరళ స్టోరీ ట్రైలర్

ది కేరళ స్టోరి. ఇండియా లో ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగాను సెగలు పుట్టిస్తుంది. ఏప్రిల్ 26 న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కేరళ లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా హిందీ భాషలో రుంపొందింది. ఈ సినిమాను సుదీప్తో సేన్ అనే దర్శకుడు తెరకెక్కించగా సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ లో విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం లో ప్రముఖ హీరోయిన్ ఆదా శర్మ ఫీమెల్ లీడ్ గా నటించగా యోగితా బిహాని, సోనియా, సిద్ధి ఇధ్నాని, విజయ్ కృష్ణ ప్రముఖ పాత్రలు పోషించారు.

ఇక ఈ ట్రైలర్ మొత్తం కేరళ లో జరిగే మత మార్పిడి ల కథతో నిండి వుంది. 2009 నుండి 2012 కేరళ లో జరిగిన మతమార్పిడి ల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ మూడేళ్ళలో కేరళలో 2667 మంది ముస్లిం లు గా మార్చబడ్డారు. ఇందులో 2195 మంది హిందువులు కాగా, 492 మంది క్రిస్టియన్లు ఉన్నారు. వీళ్లంతా ఇప్పుడు ఏమైపోయారో అన్న అంశం తో కేరళ స్టోరీ తెరకెక్కింది.

- Advertisement -

అంతే కాదు ఈ ట్రైలర్ లో విదేశాలకు చదువుకుండేందుకు వచ్చిన అమ్మాయిలను మతమార్పిడి చేసి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి “ఐ ఎస్ ఎస్” లో ఎలా చేరుస్తారో చూపించారు. ఇక విదేశాల్లో అమ్మాయిలు వాళ్ళ ఆచార, సంప్రదాయాల కారణంగా ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో కూడా ఈ ట్రైలర్ లో చూపించడం జరిగింది. అయితే ట్రైలర్ మొత్తం బాగున్నా కొన్ని రకాల కాంట్రవర్సీలకు ఈ ట్రైలర్ కారణమవుతుంది. గతం లో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ లాగే సినిమా కూడా రాజకీయాల కోసమే ఈ మూవీ వచ్చిందని ఈ సినిమా ను బ్యాన్ చేయాలనీ మహారాష్ట్ర ఎంపీ అరవింద్ సమాత్ అన్నారు. ఇక ది కేరళ స్టోరీ మే 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు