టాలీవుడ్ నటి పవిత్ర లోకేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత కొన్ని రోజులుగా తెలుగులో పవిత్ర లోకేష్ పేరే హాట్ టాపిక్. తాజాగా ఈమె సీనియర్ హీరో నరేష్ హీరోగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించింది. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో వీరి జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల సమాహారంగా తెరకెక్కిన సినిమా ‘మళ్లీ పెళ్లి’.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె స్టార్ హీరోయిన్ కావాల్సిన మెటీరియల్. అయినా ఈ భామ ఎందుకు స్టార్ హీరోయిన్ కాలేకపోయిందో అని అందరూ చర్చించుకుంటున్నారు. నరేష్ మరియు పవిత్ర లోకేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయం మీడియాకు లీక్ అయినప్పటి నుంచి ఈ జంట గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
ఇక ఈ తరుణంలోని నటి పవిత్ర లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన జీవితంలో తన క్రష్ ఎవరో తాజాగా బయట పెట్టింది నటి పవిత్ర. తాను అక్కినేని నాగార్జున అంటే పడి చస్తానని… ఆయన అంటే క్రష్ ఉందని పవిత్ర లోకేష్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మన్మధుడు సినిమాతో నాగార్జున నటనకు తాను ఫిదా అయినట్టు వెల్లడించింది. అప్పుడే నాగర్జునపై ప్రేమ ఏర్పడిందని ఆమె వెల్లడించింది. ఒకప్పుడు నరేష్ కంటే ఎక్కువగా నాగార్జునను ప్రేమించే దానిని. కానీ ఇప్పుడు తనకు నరేష్ అంటే ఎక్కువ ఇష్టమని తెలిపింది. ఇక పవిత్ర లోకేష్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News