Tamannah: జమున బయో పిక్ లో

సావిత్రి తరానికి చెందిన నటీమని, సత్యభామగా ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి జమున (89) గత నాలుగైదు ఏళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుది శ్వాస విడిచారు.

1936 ఆగస్టు 30న హంపిలో జన్మించారు జమున. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. జమున తొలి చిత్రం పుట్టినిల్లు. ఈమె ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, జగ్గయ్య వంటి అలనాటి అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించింది. తెలుగు మాత్రమే కాక హిందీ, దక్షిణాది భాషల్లో అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు జమున.

అయితే గతేఏడాది జమున బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్లు కొన్ని వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు జమునగారి మరణంతో ఆ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రముఖుల బయోపిక్ తీయడం దర్శకులకు కత్తిమీద సాములాంటిదే. మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కించి ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నారు నాగ్ అశ్విన్.అలాగే సిల్క్ స్మిత బయోపిక్ హిందీలో “ది డర్టీ పిక్చర్” పేరుతో రూపొందించారు.

- Advertisement -

ఇప్పుడు ప్రఖ్యాత నటిమని జమున జీవిత చరిత్రను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. జమున బయోపిక్ లో మిల్కీ బ్యూటీ తమన్న ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేశారట. దీనిపై తమన్నతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే కథ ఇంకా ఫైనల్ కావలసి ఉందని, అనంతరం దీనిపై క్లారిటీ వస్తుందని ఫిలింనగర్ టాక్.

ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన సమాచారం అధికారికంగా ఏది బయటకు రానప్పటికీ, మరి కొద్ది రోజుల్లోనే రానుందని అంటున్నారు. మరి జమున జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు