మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ధోని ఆనతి కాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. తర్వాత ఏడాది టెస్టుల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. పాకిస్తాన్ పై ఆడిన 183 పరుగులు ఇన్నింగ్స్ తో ధోని ఇండియన్ టీం లో ఒక సెన్సేషన్ గా మారాడు. ఇక క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.
అయితే ధోని గతేడాది అక్టోబర్ లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపాడు. హోలీవుడ్ లో చిత్రాలను నిర్మించనున్నట్టు చెప్పాడు. ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేశారు. తాజాగా కొత్త సినిమాలు ప్రకటించాడు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నాడు.
ధోని ఎంటర్టైన్మెంట్స్ ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ టైటిల్ తో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, ఇవానా హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. రమేష్ తమిళమని దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ జనవరి 27న ప్రారంభమైంది. లో బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. హరీష్ కళ్యాణ్ ‘ప్యార్, ప్రేమ, కాదల్’ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. లవ్ టుడే తో ఇవానా ఈమధ్య బంపర్ హిట్ కొట్టింది. ధోని ఎంటర్టైన్మెంట్ కొత్త సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ అందుకు సంబంధించిన గ్లింప్స్ ను నెటిజన్స్ తో పంచుకుంది. ధోని ఎంటర్టైన్మెంట్ మొదటి సినిమా గ్లింప్స్ ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ ఫస్ట్ గ్లింప్స్ ను మీతో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది అని ఆ సంస్థ పేర్కొంది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.