టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ మళ్ళీ బిజీ అవుతున్నాడు. ఈ ఇయర్ “మైఖేల్” సినిమాతో వచ్చి ప్లాప్ అందుకున్నా, తన సినిమాల విషయంలో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా మంచి స్క్రిప్ట్ లు ఎంచుకోవడంలో జాగ్రత్త పడుతున్నాడు. సందీప్ కిషన్ ఇప్పటికే ఊరు పేరు భైరవకోన సినిమాలో నటించగా, ఆ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇక ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ లో కూడా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడు.
తాజాగా సందీవ్ కిషన్ హీరోగా కొత్త సినిమా లాంచ్ అయింది. తమిళ్ డైరెక్టర్ సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ తాజాగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషల్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా సందీప్ కిషన్ గతంలో నటించిన ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనుంది.
సరిగ్గా ఆరేళ్ళ కిందట అనగా 2017 లో రిలీజ్ అయిన “మాయావన్” అనే తమిళ్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు తీయబోయే సినిమా తెరకెక్కిస్తున్నారు.
Read More: LEO Movie: డైరెక్టర్లకు ఇదో గుణపాఠం… ఈ ఫార్ములా ఫాలో కావాల్సిదేనా?
మాయావన్ తెలుగులో ప్రాజెక్ట్ Z గా రిలీజ్ కాగా ఇక్కడ అంతగా ఆడలేదు. కానీ మంచి స్క్రిప్ట్ గా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇస్తుండగా, ఇతర క్యాస్టింగ్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా సందీప్ కిషన్ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
For More Updates :
Read More: Salar :మరో ప్రయోగానికి రెడీ అవుతున్న ప్రభాస్
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...