Shruti Hassan: శృతి స్థానంలో సమంత.. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ పోయినట్టేనా..?

Shruti Hassan.. ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ సలార్ సినిమా తర్వాత మంచి జోష్ మీద ఉంది. సౌత్ ఇండియా మొత్తం సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.. ప్రస్తుతం సలార్ పార్ట్ 2 తో పాటు అడవి శేషు తో కూడా ఒక సినిమా చేస్తోంది.. ఇదిలా ఉండగా శృతిహాసన్ తాజాగా బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ “చెన్నై స్టోరీ”లో నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే శృతిహాసన్ స్థానాన్ని సమంతా తీసుకున్నారని..మరి పూర్తి విషయాలు ఇప్పుడు చూద్దాం..

శృతిహాసన్ స్థానంలో సమంత..
శృతిహాసన్ గత ఏడాది ప్రభాస్ తో కలిసి సలార్ పార్ట్ వన్ సినిమాలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చెన్నై స్టోరీలో నటిస్తోంది.. కానీ తాజాగా ఏ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.. దీనికి గల కారణాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ఇదే నిజమైతే ఈమె స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.. మరొకవైపు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న పేరు స్టార్ హీరోయిన్ సమంత చిత్ర బృందం ఈమెను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

అదే కారణమా..
ప్రస్తుతం సమంత సౌత్ ఇండియన్ మినహా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్టు బృందం సమంతను సంప్రదించగా.. ఆమె ఓకే చేసినట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించిన ఈమె ఈ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో సినిమాను ప్రకటించలేదు.. మరి ఇదే నిజమైతే ఈ సినిమాతో సమంత మళ్ళీ బ్యాక్ ఇచ్చినట్లే అనే వార్తలు స్పష్టం అవుతున్నాయి..

- Advertisement -

చెన్నై స్టోరీ మూవీ..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్నట్లు సమాచారం. వివేక్ కల్రా , నిమ్మి హారస్గమా, సహాన వాసుదేవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యూకే గ్లోబల్ స్క్రీన్ ఫండ్ మద్దతుతో గురు ఫిలిమ్స్ , రిప్పల్ వరల్డ్ పిక్చర్స్ అలాగే లే లే ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకోవడంతో ఆమె అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శృతిహాసన్ స్థానాన్ని సమంత ఆక్రమించడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో పూర్తి నిజా నిజాలు తెలియాలి అంటే చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సిందే.

సమంత సినిమాలు..
సమంత చివరిగా విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటించింది.. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న కారణంగా సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ఈ సినిమా ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక దీనిపై అధికారిక ప్రకటన వస్తే పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు