Samantha : మనల్ని ప్రేమించే వాళ్ళతో ఉండాలి

హీరోయిన్ సమంత గురించి తెలియనివారు ఉండరు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇంచుమించుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించేసిన సమంత ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ లెవెల్ లో పరుగులు పెడుతోంది.

ఏం మాయ చేసావే సినిమాలో నాగచైతన్యతో సమంత కెమిస్ట్రీ ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ ఎవరు మర్చిపోలేదు. ఇక అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా సమంత కంటిన్యూ సినిమాలతో బిజీగా ఉంటూ తన కెరియర్ పై ధ్యాసపెట్టింది. సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు హిట్ కొట్టాయి. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కొన్ని సినిమాలు బాగానే హిట్ కొట్టాయి. కాగా, తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

అది ఏమిటంటే… అది కష్టం మీద ప్రస్తుతం సాధారణ స్థితికి రాగలిగాను. దీనికోసం ఎంతో పోరాటం చేశాను. ఉప్పు, చక్కెర, ఆహార ధాన్యాలు పూర్తిగా మానేశాను. మందులే నాకు ఆహారం అయ్యాయి. అంతేకాదు ఈ క్రమంలో కెరీర్ లో వైఫల్యాలపై కూడా సమీక్షించుకున్నానని తెలిపింది. ఆమె ఇంకా తన పోస్టులు రాస్తూ… జీవితంలో కొన్నిసార్లు ప్రతీది మనం అనుకున్నట్టు జరగదని తెలుసుకున్నాను. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఒక్క అడుగు ముందుకేసిన అది గెలుపే అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మనం ప్రేమించాలి, మనల్ని ప్రేమించే వాళ్ళతో ఎక్కువగా ఉండాలంటూ, దేవుడు కొంత ఆలస్యం చేసిన, చేయాల్సింది చేస్తాడని, అండగా ఉంటాడని పేర్కొంది సమంత.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు