ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఇటీవలనే విడుదలైన సంగతి అందరికి తెల్సిందే. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకి గాను ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాని వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించమంటూ చెబుతూనే చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ పేరుతో అసలు రామాయణాన్ని పక్కన పెట్టి కొత్త రామాయణం రాసి తీసాడు అంటూ కొంత మంది ప్రేక్షకులు ఆదిపురుష్ సినిమాపై ఫైర్ అవుతుండగా ఒక టాలీవుడ్ నిర్మాత మాత్రం ఈ సినిమాని హాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఆదిపురుష్ సినిమాని హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేసిన ఆ ప్రముఖ నిర్మాత ఎవరో కాదు SKN. ఈరోజుల్లో, టాక్సీవాలా, భలే భలే మగాడివోయ్ సినిమాలతో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈ నిర్మాత ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ అనే సినిమాని నిర్మిస్తున్నాడు. ఇటీవలనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకి రెడీ అవుతోంది.
ఇక ఈ నిర్మాత ఇటీవలనే ఒక టీవీ ఇంటర్యూలో పాల్గొని, ఆదిపురుష్ మూవీని ఆకాశానికి ఎత్తేసాడు. హాలీవుడ్ లో మార్వెల్, డిసి కామిక్స్ ఉన్నట్టే ఇండియన్ సినిమాకి ఆదిపురుష్ సినిమా ఉంది. ఆదిపురుష్ సినిమా మార్వెల్, డిసి కామిక్స్ కి ఇండియన్ సినిమా ఇచ్చే ఆన్సర్ అని ఆయన అన్నాడు. ఆదిపురుష్ సినిమాలో అసలు రామాయణాన్నే సరిగా చూపించలేదంటు ప్రేక్షకుల నుంచి టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News