Game changer : మరో టాలీవుడ్ స్టార్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిన కియారా !

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి అందరికి తెలిసిందే. మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం మరో టాలీవుడ్ స్టార్ పక్కన నటించడానికి రెడీ అవుతుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ అవడంతో కియారా అద్వానీకి తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ఈ బాలీవుడ్ భామ రామ్ చరణ్ పక్కన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోతానని కలలుగన్న ఈ ముంబై బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య రిలీజై, ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో కియారా మళ్ళీ బాలీవుడ్ బాట పట్టి, అక్కడి సినిమాలతో బిజీ అయిపోయింది.

అయితే మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తరువాత కియారా టాలీవుడ్ సినిమాలతో బిజీ అవనుంది. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వస్తోన్న తెలుగు, తమిళ్ బై లాంగ్వేజికల్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న కియారా, మరో టాలీవుడ్ స్టార్ యాక్టర్ తో జత కట్టడానికి రెడీఅయినట్టు టాక్. అతనెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ స్పై యూనివర్స్ లో భాగంగా రాబోతున్న వార్2 లో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ నటిస్తున్నడన్న విషయం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన కియారా నటించబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ స్టార్ట్ చేసారని, తొందర్లోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రాబోతుందనే వార్త బి టౌన్ లో గట్టిగ వినిపిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు