Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి పరిచయంతోనే అందరి మనసులను దోచుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంటూ లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పాత్రల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తనకు కోట్ల రూపాయలు ఇచ్చిన సరే అడల్ట్ సినిమాలలో కాదు కదా, కనీసం గ్లామర్ షో చేయడానికి కూడా ఆమె ఇష్టపడదు.

ఇదిలా ఉండగా, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబోకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరు కాంబోలో వచ్చిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు క్రియేట్ చేసిన మ్యాజిక్ నుంచి ప్రేక్షకులు ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. అయితే ఈ కాంబోకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. కాకపోతే ఈసారి డైరెక్ట్ గా శేఖర్ కమ్ముల కాదు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నాడట. అవునండి శేఖర్ కమ్ముల అసిస్టెంట్ డైరెక్టర్ తో సాయిపల్లవి ఓ ప్రాజెక్టు చేయబోతుందట. అయితే అది సినిమా కాదట. ఓ వెబ్ సిరీస్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు సాయి పల్లవి శివ కార్తికేయన్ తో ఓ సినిమాలో, ధనుష్ 50వ సినిమాలోనూ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు