Sai Dharma Tej: నా హృదయం బరువెక్కింది..

కొన్ని సినిమాలు మనుషుల్లోనుంచి పుడితే,
ఇంకొన్ని సినిమాలు మనసు లోతుల్లోనుంచి పుడతాయి.
సినిమాలు ఎన్ని వచ్చినా , కొన్ని మాత్రమే మనసుని హత్తుకుంటాయి.

జూన్ లో రిలీజ్ కాబోతున్న “చార్లీ 777” కూడా అలాంటి సినిమానే అనిపిస్తుంది. రిలీజైన ట్రైలర్ చూస్తుంటే జంతువుతో మనిషికి ఉండే ఎమోషనల్ కనెక్షన్ మీద ఈ సినిమా తీశారు అని అర్ధమవుతుంది.
హీరోకి తనకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని అనుకున్న సమయంలో ఈ చార్లీ (కుక్క) ఎంట్రీ ఇస్తుంది. దాని వల్ల హీరోకు ఎదురైన కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఏంటి? చివరకు ఆ చార్లీ కోసం హీరో ఏం చేశాడన్నదే కథాంశం.

ఈ ప్రపంచంలో 600 మిలియన్ డాగ్స్ ఉంటే , అందులో 400 మిలియన్ స్టెర్ డాగ్స్ ఉన్నాయ్, వాటికి ఇల్లు లేవు ఎక్కడ తింటాయో, ఏమి తింటాయో తెలియదు. మనుషులను నమ్ముకుని అడవులు వదిలేసి ఇక్కడ బ్రతుకుతున్నాయి. అవి సాటి కుక్క కంటే మనల్నే ఎక్కువ ప్రేమిస్తాయి.

- Advertisement -

బహుశా వీటన్నిటి ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారేమో,
అయితే ఈ సినిమా ట్రైలర్ చాలామందిని ఆకట్టుకుంది రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ పై మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా ఓ ట్వీట్ వేశాడు.

నా హృదయం బరువెక్కింది.. ఆ ట్రైలర్ నన్ను కదిలించింది.. సోదరా రక్షిత్ శెట్టి నీ మీద నాకు గౌరవం పెరిగింది.. ఈ సినిమాను మనకు అందిస్తున్న రానాకు థ్యాంక్స్ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వేశాడు.

సాయి తేజ్ మాములుగా వేరే హీరోల సినిమాలపై ట్వీట్లు వేస్తుంటాడు. కొన్ని సినిమాలపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు. అలా మహేష్ బాబు సర్కారు వారి పాట మీద కూడా సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. సినిమా విడుదలకు ముందు.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ వేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు