Pushpa The Rule : సుకుమార్ కు కష్టమే..?

డైరెక్టర్లు తమ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి పడే కష్టాలు మాటల్లో చెప్పలేం. హీరో, హీరోయిన్ తో పాటు నటీ నటుల నుండి బెటర్ అవుట్ పుట్ తీసుకోవాలి. వాటిని ప్రేక్షకుల ఇష్టానికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. బడ్జెట్ పై నిర్మాతలను ఒప్పించాలి. ఇన్ని చేసిన తర్వాత డైరెక్టర్లు మంచి హిట్ అందుకుంటారా అంటే, అది గ్యారంటీ ఉండదు. ఒక వేళ హిట్ అయినా, బాధలు తప్పవు. వాళ్లు తర్వాత చేసే సినిమాలపై దానికిమించి అంచనాలు పెట్టుకుంటారు ప్రేక్షకులు.

ఇలాంటి కష్టాలు ప్రస్తుతం పుష్ప డైరెక్టర్ సుకుమార్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన “పుష్ప ది రైజ్” ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఈ మూవీ డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న “పుష్ప ది రూల్” పై అందరి దృష్టి పడింది.

ఫస్ట్ పార్ట్ కు భారీ విజయం దక్కడంతో, సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో సుకుమార్ పై ఒత్తిడి కాస్త పెరిగిందనే చెప్పాలి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మూవీ షూటింగ్ జరగడం లేదు. అలాగే ఇప్పటి వరకు ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. దీంతో “పుష్ప ది రూల్” ఇప్పట్లో రిలీజ్ అవ్వడం కష్టమేనని చెప్పవచ్చు.

- Advertisement -

పుష్ప ఫస్ట్ పార్ట్ షూటింగ్ తర్వాత పోస్టు ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేశారు. కానీ సీక్వెల్ మూవీకి అలా కాకుండా, ఆచి తూచి అడుగులు వేయాలని సుకుమార్ నిర్ణయం తీసుకున్నాడట. పుష్ప ది రూల్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఏకంగా నాలుగు నెలల సమయం కేటాయించాలని సుక్కు ప్లాన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా, సుకుమార్ ఎంత టైం తీసుకున్నా, పుష్ప ది రూల్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా డిజైన్ చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు