Virupaksha: యాక్షన్.. సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న మెగాహీరో

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటించిన చిత్రం విరూపాక్ష. కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా యొక్క ఆఫీషియల్ ట్రైలర్ ఈ రోజు అనగా ఏప్రిల్ 11న ఉదయం 11.07 గంటలకు విడుదలైంది. ట్రైలర్ మొత్తం ట్విస్ట్ లు సస్పెన్స్ లతో నింపేశాడు దర్శకుడు. ఈ ట్రైలర్ లో గమనించిన విషయం ఏంటంటే హీరో తన సొంతూరు కి చాలా ఏళ్ళ తరువాత తన కుటుంబం తో వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ ఊరిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొకొంటున్నాడు అని ట్రైలర్ లో చూపించాడు.

హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్ కి ఇందులో బాగా పెర్ఫర్మ్ చేయగలిగే రోల్ దొరికిందని అనిపిస్తుంది. అయితే ట్రైలర్ లో అక్కడక్కడా కార్తికేయ, జాంబి రెడ్డి సినిమాల ఛాయలు కనిపించాయి.
మొత్తంగా సినిమా ఒక చిన్న గ్రామంలో ఉన్న సమస్యల గురించి పరిష్కారం వెతుకుతూ హీరో పోరాడుతున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు.

ఇక విరూపాక్షలో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సాయి చంద్, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రచన సహకారం అందించగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. విరూపాక్ష సినిమా ను ఏప్రిల్ 21 న పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు